kasani to join TRS: టీఆర్ఎస్ గూటికి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్
ABN , First Publish Date - 2022-09-16T16:55:29+05:30 IST
మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ మహా సభ జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు.
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ మహా సభ జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ (kasani gnaneshwar) టీఆర్ఎస్ (TRS) గూటికి చేరనున్నారు. బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ (Convenor of BJP Recruitment Committee) ఈటెల రాజేందర్ (Etela Rajender) ఇటీవల జ్ఞానేశ్వర్ను కలిసి చర్చలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు (Harish rao) వెంటనే రంగంలోకి దిగి కాసానితో మంతనాలు జరిపారు. హరీష్ (Telangana minister) ప్రయత్నాలు ఫలించి... జ్ఞానేశ్వర్ టీఎర్ఎస్లో చేరేందుకు అంగీకారం తెలిపారు. రెండు రోజుల క్రితం ముదిరాజ్ మహాసభ సమావేశంలో కాసాని టీఎర్ఎస్లో చేరడానికి రాష్ట్ర కమిటీ ఆమోదం తెలిపారు. కాసాని చేరికకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో టీఎర్ఎస్లో కాసాని జ్ఞానేశ్వర్ చేరనున్నారు.