‘డబుల్’ ఇళ్లు ఇప్పిస్తామని డబ్బులు వసూల్
ABN , First Publish Date - 2022-07-28T16:52:12+05:30 IST
డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన ఐదుగురిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు ...
ఐదుగురి అరెస్ట్, పరారీలో ముగ్గురు
హైదరాబాద్/మన్సూరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన ఐదుగురిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురంలో ఉంటున్న సిందే శివకుమార్ ఆటో డ్రైవర్. అతడు మరో మహిళ ఉమతో కలిసి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని 12 మంది వద్ద రూ.3.50 లక్షలు, దుకాణాలు ఇప్పిస్తామని పలువురి నుంచి రూ. 4 లక్షలు డబ్బులు వసూల్ చేశారు. అనంతరం వారికి నకిలీ ఇళ్ల పట్టా పత్రాలు ఇచ్చారు. పట్టా కాగితాను తెరచి చూడగా వారి పేర ఇళ్లు లేవు. దాంతో మోసం పోయానని గ్రహించిన బాధితురాలు శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శివకుమార్, ఉమతో పాటు సరిత, రాజు, చంద్రవదన్న్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ మోసం మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.