ఫ్యామిలీ కోర్టును తరలించొద్దు

ABN , First Publish Date - 2022-11-12T00:36:59+05:30 IST

సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టులో ఉన్న ఫ్యామిలీ కోర్టును మరో ప్రాంతానికి తరలించొద్దని సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మంద మురళీ డిమాండ్‌ చేశారు.

ఫ్యామిలీ కోర్టును తరలించొద్దు

అడ్డగుట్ట, నవంబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టులో ఉన్న ఫ్యామిలీ కోర్టును మరో ప్రాంతానికి తరలించొద్దని సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మంద మురళీ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టులో ఉన్న ఫ్యామిలీ కోర్టును సిటీ సివిల్‌ కోర్టు ప్రాంగణంలోకి తరలించడాన్ని విరమించుకోవాలన్నారు. సికింద్రాబాద్‌ చుట్టుపక్కల ఉన్న అల్వాల్‌, బొల్లారం, ఈసీఐఎల్‌, తార్నాక, సికింద్రాబాద్‌ ప్రాంతాలకు చెందిన కక్షిదారులు కోర్టుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడతారన్నారు. పలు విషయాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ కోర్టు తరలించడాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. నిరసన కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు విజయలక్ష్మి, అన్నపూర్ణ, జాయింట్‌ సెక్రటరీ బాలునాయక్‌, కోశాధికారి మురళీమోహన్‌, రమణ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-12T00:37:01+05:30 IST