కాంగ్రెస్లో సద్దుమణగని జగ్గారెడ్డి వివాదం
ABN , First Publish Date - 2022-02-20T14:55:58+05:30 IST
కాంగ్రెస్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదం ఇంకా కొనసాగుతోంది.
హైదరాబాద్: కాంగ్రెస్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివాదం ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్కు గుడ్బై చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే స్పష్టం చేయడంతో ఆయనను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. జగ్గారెడ్డి చేజారకుండా పార్టీ ముఖ్యులు మంతనాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో రేపు జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. రాహుల్, సోనియా గాంధీతో భేటీకి ఉత్తమ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి ఏఐసీసీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. నేతలెవరూ మీడియా ముందు మాట్లాడొద్దని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.