పుస్తకాల పండగ వచ్చేస్తోంది

ABN , First Publish Date - 2022-11-18T05:00:22+05:30 IST

పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుస్తక మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 35వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవం డిసెంబరు 22 తేదీన ప్రారంభం కానుంది.

పుస్తకాల పండగ వచ్చేస్తోంది

వచ్చే నెల 22 నుంచి హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుస్తక మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. 35వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవం డిసెంబరు 22 తేదీన ప్రారంభం కానుంది. నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా జనవరి 1 వరకు అంటే 10 రోజుల పాటు ప్రదర్శన కొనసాగనుంది. ఎప్పట్లాగే తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ భాషల పుస్తకాలకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు వందకు పైగా ప్రచురణకర్తలు ఈసారి కూడా వస్తున్నారు. ఈ మహోత్సవంలో 300కు పైగా పుస్తక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. పుస్తక మహోత్సవం అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌, ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్‌ ఈ వివరాలను తెలిపారు.

Updated Date - 2022-11-18T05:01:19+05:30 IST