బీజేపీ బల ప్రదర్శన
ABN , First Publish Date - 2022-07-02T16:44:19+05:30 IST
రేపు నగరంలో జరిగే బహిరంగసభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా జన సమీకరణకు బీజేపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ
బహిరంగసభకు భారీగా సమీకరణ
ఆహ్వానితులకు స్వాగతం పలికే వారి జాబితాలో విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్/రంగారెడ్డి: రేపు నగరంలో జరిగే బహిరంగసభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా జన సమీకరణకు బీజేపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అతిరథ మహా రథులందరూ హాజరవుతున్న సభకు రాష్ట్రనలుమూలల నుంచి భారీగా జనాన్ని తరలిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 5 నుంచి 15వేల మందిని తరలించేవిధంగా స్థానిక నేతలకు టార్గెట్లు విధించారు. ముఖ్యంగా నగర శివారు నియోజకవర్గాల నుంచి ఎక్కువగా జనాన్ని సమీకరించనుంది. నియోజకవర్గ ఇన్చార్జిలు, బూత్కమిటీలకు ఈ బాధ్యతలకు అప్పగించింది. నియోజకవర్గాల వారీగా ర్యాలీగా వాహనాలతో నగరానికి రావాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది. తద్వారా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బల ప్రదర్శనకు దిగాలని భావిస్తోంది. మరోవైపు ముందస్తు ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో టిక్కెట్ ఆశావాహులు జనాన్ని తరలించేందుకు పోటీపడుతున్నారు.