Bandi sanjay padayatra: కేపీహెచ్‌బీలో మూడో రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-14T16:41:30+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కేపీహెచ్‌బీ కమ్యూనిటీ సెంటర్ నుంచి మూడో రోజు ప్రారంభమైంది.

Bandi sanjay padayatra: కేపీహెచ్‌బీలో మూడో రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) పాదయాత్ర కేపీహెచ్‌బీ కమ్యూనిటీ సెంటర్ నుంచి మూడో రోజు ప్రారంభమైంది. కేపీహెచ్‌బీ కమ్యూనిటీ సెంటర్ నుంచి శేష గ్రాండ్ హోటల్, రెయిన్బో విస్టాస్, అంజయ్య నగర్, చిత్తారమ్మ ఆలయం, మూసాపేట, భరత్ నగర్ అండర్ బ్రిడ్జి, జింకలవాడ, దీన్ దయాల్ నగర్, పైపులైను రోడ్డు, శోభనా థియేటర్ మీదుగా బాల్ నగర్ గ్రామం వరకు పాదయాత్ర కొనసాగనుంది.  ఈరోజు బాలనగర్ గ్రామం సమీపంలో బండి సంజయ్ (BJP Leader) రాత్రి బస చేయనున్నారు. ఇవాళ మొత్తం 13 కిలోమీటర్ల మేర బీజేపీ అధ్యక్షుడి పాదయాత్ర కొనసాగనుంది. వీఆర్ఏలపై ‘‘కేసీఆర్ సర్కార్ లాఠీ ఛార్జ్’’ ను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు, కండువాలు ధరించి గంటసేపు  బండి సంజయ్ & టీమ్ పాదయాత్ర చేయనుంది. 

Updated Date - 2022-09-14T16:41:30+05:30 IST