TS News: పంజాగుట్ట పోలీస్స్టేషన్ ముట్టడికి బీజేపీ యత్నం
ABN , First Publish Date - 2022-09-19T19:48:28+05:30 IST
నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముట్టడికి బీజేపీ యత్నించింది. టీఆర్ఎస్ బోరబండ డివిజన్ కో-ఆర్డినేటర్ విజయ్సింహ చేతిలో దాడికి గురైన మహిళకు వెంటనే న్యాయం జరగాలంటూ ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముట్టడికి బీజేపీ (BJP) యత్నించింది. టీఆర్ఎస్ బోరబండ డివిజన్ కో-ఆర్డినేటర్ విజయ్సింహ (Vijaysimha) చేతిలో దాడికి గురైన మహిళకు వెంటనే న్యాయం జరగాలంటూ ఆందోళనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను చెదరగొట్టారు. వారిని అరెస్ట్ చేసిన ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత పల్లపు గోవర్థన్ మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ అంటూ చెప్పుకుంటున్న వ్యక్తి నిషా అనే మహిళపై దాడి చేశారని తెలిపారు. ఘటన జరిగిన విషయం పోలీసు దృష్టికి వచ్చిన ఎందుకు ఇప్పటి వరకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు దాడులు చేస్తే కేసులు ఉండవా అంటూ నిలదీశారు. శ్రీరాముడి శోభ యాత్ర చేస్తే తమపై కేసులు పెట్టారని మండిపడ్డారు. మహిళలపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేసినా కేసులు ఉండవని అసెంబ్లీలో ఓ జీవో పాస్ చేయండంటూ యెద్దేవా చేశారు. యాక్షన్ తీసుకునేంతవరకు బీజేపీ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని పల్లపు గోవర్థన్ స్పష్టం చేశారు.