భాగ్యలక్ష్మి అమ్మవారిని కూలుస్తామని ఎవరు అన్నారు?: Bhatti
ABN , First Publish Date - 2022-06-02T21:22:34+05:30 IST
కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలు, మతాలు ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
Hyderabad: కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలు, మతాలు ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. గురువారం గాంధీ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ భాగ్యలక్ష్మి అమ్మవారిని తాము కూడా ఆరాధిస్తామని, కూలుస్తామని ఎవరు అన్నారని ప్రశ్నించారు. మతోన్మాదాన్ని రెచ్చ గొట్టి లబ్ది పొందాలని బీజేపీ (BJP) చూస్తోందన్నారు. ఎనిమిదేళ్లు మాట్లాడకుండా సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏడిస్తే ఏం ఉపయోగమని అన్నారు. బీజేపీ పాపాల్లో టీఎర్ఎస్ (TRS) భాగస్వామ్యం కూడా ఉందని ఆరోపించారు. ఏడు మండలాలు ఏపీలో కలిపినప్పుడు అఖిల పక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకువెళ్లలేదని ప్రశ్నించారు. బీజేపీతో ఎక్కడో చేడింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నారని భట్టి విక్రమార్క అన్నారు.