TS News: సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి లేఖ

ABN , First Publish Date - 2022-09-02T19:39:07+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు.

TS News: సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి లేఖ

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) లేఖ (Letter) రాశారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్ధులకు మంచి భోజనం పెట్టాలని, 550 మంది విద్యార్థులకు 12 తరగతులు సరిపోతాయా? అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని, మౌళిక సదుపాయాల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. పాఠశాలలు ప్రారంభమై నాలుగు నెలలు అవుతున్నా.. ఇంత వరకు విద్యార్థులకు పుస్తకాలు అందలేదన్నారు. త్వరలో గురుకుల, ప్రభుత్వ హస్టల్స్, జూనియర్ కళాశాలలు సందర్శిస్తానని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Updated Date - 2022-09-02T19:39:07+05:30 IST