అమిత్ షా సభకు మించి..Bandi Sanjay
ABN , First Publish Date - 2022-06-15T01:10:59+05:30 IST
Hyderabad: తుక్కుగూడ అమిత్ షా సభకు మించి ప్రధాని మోదీ సభ ఉంటుందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆయన బీజేపీ పదాధికారుల సమావేశంలో మాట్లాడారు.
Hyderabad: తుక్కుగూడ అమిత్ షా సభకు మించి ప్రధాని మోదీ సభ ఉంటుందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ పేర్కొన్నారు. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆయన బీజేపీ పదాధికారుల సమావేశంలో మాట్లాడారు.
‘‘డబుల్ ఇంజిన్ సర్కారే లక్ష్యంగా జాతీయ నాయకత్వం మద్దతు ఇస్తుంది. తెలంగాణపై బీజేపీ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జులై 3న ప్రధాని మోదీతో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభ చరిత్రలో నిలిచిపోవాలి. సభను విజయవంతానికి భారీగా జనసమీకరణ చేయాలి. ఈ బాధ్యత పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇంచార్జులు తీసుకోవాలి. అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాదని.. కార్యవర్గ సమావేశాల ఏర్పాటుకు తెలంగాణకు ఇచ్చారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. సభ స్థలాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తాం. జిల్లా, మండల, పోలింగ్ బూత్ స్థాయి నుంచి ప్రతీ కార్యకర్త సభకు వచ్చేలా ప్రచారం చేయాలి.’’ అని సంజయ్ పేర్కొన్నారు.