తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆఎర్ ట్రస్టీ మాత్రమే.‌.‌: బక్కని

ABN , First Publish Date - 2022-02-23T18:08:16+05:30 IST

తెలంగాణలో ఖాళీగా ఉన్న కొలుపులను వెంటనే భర్తీ చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు బక్కని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆఎర్ ట్రస్టీ మాత్రమే.‌.‌: బక్కని

హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న కొలుపులను వెంటనే భర్తీ చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన నిరుద్యోగ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం రాష్ట్రవ్యాప్త పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. సొంత రాష్ట్రం.. స్వయంపాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆఎర్ ట్రస్టీ మాత్రమేనని, తెలంగాణ ఆయన సొంతం‌ కాదన్నారు. మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పనిచేసిన కేసీఆర్.. పాలమూరు అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. బర్రెలు, గొర్రెలు ఇచ్చిన ప్రభుత్వం.. ఉద్యోగాలు, విద్య, వైద్యాన్ని మరిచిందని ఆరోపించారు. డీఎస్సీలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు.


బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మతిలేకుండా మాట్లాడుతున్నారని, చంద్రబాబును విమర్శించే స్థాయి సంజయ్‌కు లేదని బక్కని నరసింహులు అన్నారు. ప్రధానులు, రాష్ట్రపతులను నిర్ణయించిన నాయకుడు చంద్రబాబని అన్నారు. ఎంపీ పదవి, ఆధ్యక్ష పదవి శాశ్వతం కాదని ఈ విషయం బండి సంజయ్ గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు మూడు సార్లు లేఖ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా బక్కని నరసింహులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ నేతలు రావుల, నన్నూరి నర్సిరెడ్డి, జ్యోత్స్న, ఇతర నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-23T18:08:16+05:30 IST