లింగాయత్ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చండి
ABN , First Publish Date - 2022-12-29T03:24:56+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్-లింగబలిజ కులాన్ని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం అహిర్కు వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య నేతృత్వంలోని బృందం విజ్ఞప్తి చేసింది.
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్కు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి
న్యూఢిల్లీ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్-లింగబలిజ కులాన్ని కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం అహిర్కు వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య నేతృత్వంలోని బృందం విజ్ఞప్తి చేసింది. బుధవారం ఢిల్లీలో రాష్ట్ర వీరశైవ లింగాయత్-లింగబలిజ సంఘం అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప, గౌరవ అధ్యక్షులు పట్లోళ్ల సంగమేశ్వర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తదితరులు హన్స్రాజ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్-లింగబలిజలు చాలా పేదరికంలో ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల జాబితాలో ఉన్నప్పటికీ కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేనందువల్ల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కొల్పుతున్నారని వివరించారు.