TS News: నాంపల్లి ఎఫ్ఎస్ఎల్కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు
ABN , First Publish Date - 2022-11-11T10:16:11+05:30 IST
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు.
హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలు కేసు (TRS MLAs case)లో ముగ్గురు నిందితులను పోలీసులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. వారిని నాంపల్లి ఎఫ్ఎస్ఎల్కు తరలించారు. రెండో రోజు కస్టడీలో భాగంగా నిందితుల వాయిస్ను రికార్డింగ్ చేయనున్నారు. ఎఫ్ఎస్ఎల్లో నిందితుల వాయిస్ పరిశీలన పరీక్షలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడ్డ ఆడియో, వీడియోలలోని వాయిస్తో పోల్చి చూడనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకం కానుంది.