నేడు పాఠశాలల బంద్‌

ABN , First Publish Date - 2022-07-05T16:16:19+05:30 IST

ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, విద్యార్థి నాయకులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని మంగళవారం పాఠశాలల బంద్‌కు పిలుపు

నేడు పాఠశాలల బంద్‌

హైదరాబాద్/పంజాగుట్ట : ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, విద్యార్థి నాయకులపై అక్రమ కేసులను ఎత్తివేయాలని మంగళవారం పాఠశాలల బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కమల్‌ సురేష్‌ తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు ఝాన్సీ, వి. శ్రీశైలం, రాష్ట్ర నాయకులు అరవింద్‌, సిరివెన్నెలతో కలిసి మాట్లాడారు. విద్యా సంవ్సతరం ప్రారంభమై 20 రోజులు దాటినా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్‌ ఇవ్వలేదని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు.అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-07-05T16:16:19+05:30 IST