Tarun Chugh: తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

ABN , First Publish Date - 2022-11-01T12:00:55+05:30 IST

తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఫిర్యాదు చేశారు.

Tarun Chugh: తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు

న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ నేతల (BJP Leaders) ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ (Tarun chugh) ఫిర్యాదు చేశారు. మునుగోడు ఎన్నికల్లో (Munugodu by poll) ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ నేతల ఫోన్లను టాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా నగదు లావాదేవీలపై అక్రమంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు టీఆర్‌ఎస్ (TRS) కోసం ప్రచారం చేస్తున్నాయని అన్నారు. టీఏన్జీవో (TNGO), ఆర్టీసీ సంఘాల నిన్నటి ప్రెస్‌మీట్‌ను తరుణ్ చుగ్ (BJP Telangana Incharge) ఫిర్యాదులో ప్రస్తావించారు.

Updated Date - 2022-11-01T12:05:22+05:30 IST