యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-02T00:46:16+05:30 IST

జిల్లాలోని యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ గురువారం ఒక ప్రకటనలో కోరారు.

యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 1: జిల్లాలోని యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ గురువారం ఒక ప్రకటనలో కోరారు. 17 ఏళ్లుపై బడిన యువత, వసతి గృహాల్లో 17 ఏళ్లు నిండిన విద్యార్థులు ముందస్తుగా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేక ఓటర్ల నమో దు జాబితా 2023 వార్షిక సవరణ కోసం 2023 జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిం డిన పౌరులు ఎవరైనా ముసాయిదా ప్రకారం నియమిత తేద నుంచి ఓటరుగా నమోదు చేసుకోవడానికి ముందస్తు దరఖాస్తును సమర్పించవ్చని తెలిపారు.

Updated Date - 2022-12-02T00:46:17+05:30 IST