డబుల్బెడ్రూం ఇళ్లు ఎప్పుడిస్తారు?
ABN , First Publish Date - 2022-05-18T05:38:27+05:30 IST
మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద బోథ్ ఎమ్మెల్యే రాథోడ్బాపురావుకు నిరసన సెగ తగిలింది.
బోథ్లో ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు
బోథ్, మే17: మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద బోథ్ ఎమ్మెల్యే రాథోడ్బాపురావుకు నిరసన సెగ తగిలింది. మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనగా పిప్పల్ధరి గ్రామానికి చెందిన కొందరు మహిళలు తమకు డబుల్బెడ్రూం ఇళ్లు ఎప్పుడిస్తారని నిలదీశారు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్లు మాత్రం ఇవ్వడం లేదన్నారు. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. తమకు ఇళ్లు లేక పూరి గుడిసెల్లో నివసిస్తున్నామని, రాత్రులో విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే నిధులు రాగానే ఇస్తామంటూ అక్కడ నుంచి వెళ్లి పోయారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్ సర్పంచ్ సురేందర్యాదవ్, జడ్పీటీసీ సంధ్యారాణి, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు తాహెర్బిన్ సలాం, మండల కో ఆప్షన్ సభ్యులు మహిమూద్, ఐకేపీ, ఏపీవో మాధవ్, మహిళా సంఘాల వారు పాల్గొన్నారు.