సంక్షేమ ఫలాలు గిరిజనులకు అందేలా చూడాలి: ఐటీడీఏ పీవో
ABN , First Publish Date - 2022-06-24T05:10:22+05:30 IST
గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అందరికీ అందేలా చూడాలని ఐటీ డీఏ పీవో వరుణ్రెడ్డి తెలిపారు. గురువారం ఐటీడీఏ ప్రా జెక్ట్ అధికారి కార్యాలయంలో ఆదిమ గిరిజన సంక్షేమ స లహా కమిటీ(ఏటీడబ్ల్యూఏసీ) ఆధ్వర్యంలో నాలుగు జిల్లా ల గిరిజన సంక్షేమశాఖాధికారులతో గిరిజనాభివృద్ధికై కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్ర ధానంగా విద్యా, వైద్యంకు సంబంధించిన అంశాల గురిం చి చర్చించారు. ఉమ్మడి జిల్లాల ఆశ్రమ, గురుకుల పాఠ శాలల పనితీరు, విద్యార్థుల సంఖ్య, పాఠశాలల్లో పనిచేస్తు న్న ఉపాధ్యాయులు, సీఆర్టీలు గురించి అడిగి తెలుసుకు న్నారు
ఉట్నూర్, జూన్ 23: గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అందరికీ అందేలా చూడాలని ఐటీ డీఏ పీవో వరుణ్రెడ్డి తెలిపారు. గురువారం ఐటీడీఏ ప్రా జెక్ట్ అధికారి కార్యాలయంలో ఆదిమ గిరిజన సంక్షేమ స లహా కమిటీ(ఏటీడబ్ల్యూఏసీ) ఆధ్వర్యంలో నాలుగు జిల్లా ల గిరిజన సంక్షేమశాఖాధికారులతో గిరిజనాభివృద్ధికై కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్ర ధానంగా విద్యా, వైద్యంకు సంబంధించిన అంశాల గురిం చి చర్చించారు. ఉమ్మడి జిల్లాల ఆశ్రమ, గురుకుల పాఠ శాలల పనితీరు, విద్యార్థుల సంఖ్య, పాఠశాలల్లో పనిచేస్తు న్న ఉపాధ్యాయులు, సీఆర్టీలు గురించి అడిగి తెలుసుకు న్నారు. జీసీసీ ద్వారా సరఫరా అవుతున్న అటవీ ఉ త్పత్తుల అమ్మకాలు, కొనుగోలు వివరాలు, వ్యవసాయదా రులకు అందిస్తున్న సదుపాయాలు, ట్రైకార్ రుణాలు, గిరి వికాసం, ఏజెన్సీలో గల పీహెచ్సీల పనితీరు, ఆర్వోఎఫ్ఆ ర్/ఎల్టీఆర్కు సంబంధించిన భూమి వివరాలను తెలు సుకున్నారు. సంక్షేమ ఫలాలు గిరిజనులకు అందేలా చ ర్యలు తీసుకోవాలని సూచించారు. ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, డైరెక్టర్ కుమ్ర ఈశ్వరీబాయి, ఏపీవో కనక భీంరావ్, ఈఈ భీంరావ్ తదితరులు పాల్గొన్నారు.