వెల్మల్ బొప్పారం పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ABN , First Publish Date - 2022-12-10T01:40:37+05:30 IST
మండలంలోని వెల్మల్ బొప్పారం సెకండరీ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సోన్, డిసెంబరు 9 : మండలంలోని వెల్మల్ బొప్పారం సెకండరీ పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మరమ్మతుల పనులను పరిశీలించారు. ఫ్లోరింగ్, విద్యుత్, తాగునీటి సౌకర్యం తదితర పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పాఠశాల ఆవరణలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసి అందులో వాలీబాల్, బాస్కెట్ బాల్, ఫుట్బాల్, క్రికెట్ సౌకర్యాల ఏర్పాటు చేయాలన్నారు. నిర్ణీత వ్యవధిలోగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అన్ని హంగులతో ఈ నెల 24 లోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈపీఆర్ శంకరమ్య, డీఈపీఆర్ తుకారాం, తహసీల్దార్ హిమబిందు, స్థానిక సర్పంచ్ అంకం గంగామణి శ్రీనివాస్, గ్రామస్థులు డి. నర్సయ్య, తదితరులు ఉన్నారు.