రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2022-01-14T06:58:35+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే

ముథోల్‌, జనవరి, 13 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని విట్టోలి గ్రామంలో గురువారం రైతుబంధు సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంత రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతుల కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనిచేస్తారని గుర్తుచేశారు. కార్యక్రమం లో మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ పి. కృష్ణ, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు అప్రోజ్‌ ఖాన్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ వెంకటేష్‌గౌడ్‌, మండల రైతుబంధు అధ్యక్షులు రామ్‌రెడ్డి, నాయకులు బాశెట్టి రాజన్న సురేందర్‌రెడ్డి, నగే ష్‌, రవీందర్‌రెడ్డి, వంశీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

సీఎం సహాయనిధి ఎన్‌వోసీ అందజేత

కుంటాల, జనవరి 13 : మండల కేంద్రం కుంటాలకు చెందిన పంగెర లక్ష్మారెడ్డికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును గురు వారం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తననివాసంలో అందజేశారు. లక్ష్మారెడ్డి ఊ పిరితిత్తుల సమస్యతో బాధపడుతుండగా, ఆసుపత్రి ఖర్చుల నిమత్తం సీఎం సహాయనిధి నుంచి రూ.6లక్షలు మంజూరైనట్లు, సంబంధిత ఎన్‌వోసీని బాధితుని భార్యకు అందజేసినట్లు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తెలి పారు. సీఎం సహాయనిధి మంజూరికి కృషి చేసిన ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డికి బాధితులు, నాయకులు కృతజ్ఙతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-14T06:58:35+05:30 IST