కోర్టు ఆదేశాలతో ఆరు నెలల తర్వాత మృతదేహం వెలికితీత

ABN , First Publish Date - 2022-12-02T00:48:26+05:30 IST

మనిషి మృతి చెందిన ఆరు నెలల తర్వాత మృతదేహాన్ని వెలికి తీసిన ఘటన జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.

కోర్టు ఆదేశాలతో ఆరు నెలల తర్వాత మృతదేహం వెలికితీత
మృతదేహాన్ని వెలికి తీస్తున్న దృశ్యం

ఖానాపూర్‌ సీఐ అజయ్‌బాబు వెల్లడి

దస్తూరాబాద్‌, డిసెంబరు 1 : మనిషి మృతి చెందిన ఆరు నెలల తర్వాత మృతదేహాన్ని వెలికి తీసిన ఘటన జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని దస్తూరాబాద్‌ మండలం బుట్టా పూర్‌ గ్రామానికి చెందిన కొండపల్లి మల్లయ్య(55) అనే వ్యక్తి ఈ ఏడాది మే 10వ తేదీన మృతి చెందాడు. అతని మృతిపై అనుమానాలు ఉన్నట్లు మల్లయ్య తల్లి లక్ష్మి కోర్టును ఆశ్రయించింది. తన కోడలు, ఆమె బంధు వులు కలిసి తన కుమారుడైన మల్లయ్యను చంపేశారని లక్ష్మికోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు గురువారం దస్తూరాబాద్‌ తహసీల్దార్‌ లక్ష్మి సమక్షంలో పోలీసులు.. మల్లయ్య మృత దేహాన్ని వెలికి తీశారు. అనంతరం మల్లయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్టు ఖానాపూర్‌ సీఐ అజయ్‌ బాబు తెలిపారు. మల్లయ్య మృతిపై కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్టు సీఐ వివరించారు.

Updated Date - 2022-12-02T00:48:30+05:30 IST