ఫుట్బాల్ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి: వంటేరు
ABN , First Publish Date - 2022-04-25T04:52:55+05:30 IST
ఫుట్బాల్ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఫుట్బాల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, టీఎస్ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్పరెడ్డి పిలుపునిచ్చారు.
గజ్వేల్, ఏప్రిల్ 24: ఫుట్బాల్ సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఫుట్బాల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, టీఎస్ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతా్పరెడ్డి పిలుపునిచ్చారు. గజ్వేల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఫుట్బాల్ సమ్మర్ క్యాంపునకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ సహకారంతో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25వరకు సమ్మర్ క్యాంపును గజ్వేల్లోని మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 10 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల క్రీడాకారులు తమ పేర్లను 9908789877 నంబర్లో సంప్రందించి పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఆయనవెంట ఎంపీపీ అమరావతి, గజ్వేల్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగిశెట్టి రవీందర్, ఉపాధ్యక్షుడు గంగాల నరేశ్, కోచ్ నగేశ్, అజహర్, కౌన్సిలర్ రహీం, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నవాజ్మీరా, అహ్మద్, స్వామిచారీ, నర్సింహులు, లక్ష్మీనర్సయ్య ఉన్నారు.