కదిలిలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-10-04T03:18:48+05:30 IST

మండలంలోని శ్రీ మాతాన్నపూర్ణ కదిలి పాపహరేశ్వరాలయంలో శ్రీ దుర్గా నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

కదిలిలో ప్రత్యేక పూజలు
కదిలిలోని మాతాన్నపూర్ణ దేవి పూజలు చేస్తున్న భక్తులు

దిలావర్‌పూర్‌, అక్టోబరు 3 : మండలంలోని శ్రీ మాతాన్నపూర్ణ కదిలి పాపహరేశ్వరాలయంలో శ్రీ దుర్గా నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పాపహరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ మాతాన్నపూర్ణేశ్వరి దేవి రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తోంది. ప్రతి రోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతో పాటు కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నారు. కదిలి గ్రామానికి చెందిన యువకులు అమ్మవారి మాలధారణ చేసి నియమ నిష్టలతో అమ్మవారిని కొలుస్తున్నారు. ప్రతి రోజు భక్తులకు ఉచిత అన్నదానం చేస్తున్నారు. దేవస్థానం చైర్మన్‌ భుజంగ్‌ రావు పాటిల్‌, మాడెగాం ఉప సర్పంచ్‌ మారుతీ పాటిల్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ దత్తురాం పాటిల్‌లు అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు.

Updated Date - 2022-10-04T03:18:48+05:30 IST