పాఠశాలల ఎదుట ఎస్ఎఫ్ఐ నిరసన
ABN , First Publish Date - 2022-07-01T04:05:47+05:30 IST
పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించా లని డిమాండ్చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా గురువారం ఎస్ఎఫ్ఐ నాయకులు కాగజ్నగర్, బెజ్జూరు మండలకేంద్రాల్లోని జడ్పీఎస్ఎస్ పాఠశాలల ఎదుట నిరసన చేప ట్టారు.
కాగజ్నగర్/బెజ్జూరు/పెంచికలపేట, జూన్ 30: పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించా లని డిమాండ్చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా గురువారం ఎస్ఎఫ్ఐ నాయకులు కాగజ్నగర్, బెజ్జూరు మండలకేంద్రాల్లోని జడ్పీఎస్ఎస్ పాఠశాలల ఎదుట నిరసన చేప ట్టారు. ఈసందర్భంగా వారు మాట్లా డుతూ పాఠశాలలు ప్రారంభమై 15 రోజులు గడస్తున్నా పుస్తకాలు రాలే దని, తరగతి గదులు,మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవని, ఉపాధ్యాయులు లేరని, ఒక్కొక్క స్కూల్లో ఏకోపాధ్యాయులే ఉన్నాన్నారు. దీనివల్ల విద్యార్థులు నష్ట పోతున్నారన్నారు.