ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-10-18T06:35:45+05:30 IST
సుదూర ప్రాంతాల నుంచి వివిధ సమస్యలతో వచ్చే బాధితుల సమ స్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని అద నపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు.
అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే
నిర్మల్ టౌన్, అక్టోబరు 17 : సుదూర ప్రాంతాల నుంచి వివిధ సమస్యలతో వచ్చే బాధితుల సమ స్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని అద నపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులలో భాగంగా అర్జీదారుల నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ స్వీకరించారు. 40 దరఖాస్తులు వచ్చాయని, భూ సమస్యలు, పెన్షన్, తదితర అర్జీలను సంబంధిత అధి కారులను వెంటనే తగినచర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.