ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-13T06:24:35+05:30 IST

సుదూర ప్రాంతాల నుంచి వివిధ సమస్య లతో వచ్చే బాధితుల సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్క రించాలని అదనపు కలెక్టర్లు పి.రాంబాబు, హేమంత్‌బోర్కడే అన్నారు.

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాంబాబు

అదనపు కలెక్టర్‌ పి.రాంబాబు

నిర్మల్‌ టౌన్‌, సెప్టెంబరు 12 : సుదూర ప్రాంతాల నుంచి వివిధ సమస్య లతో వచ్చే బాధితుల సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్క రించాలని అదనపు కలెక్టర్లు పి.రాంబాబు, హేమంత్‌బోర్కడే అన్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజాఫిర్యాదులలో భాగంగా అర్జీదారుల నుంచి అర్జీలను అదనపు కలెక్టర్‌ స్వీకరించారు. 12 దరఖాస్తులు వచ్చాయని, భూ సమస్యలు, పెన్షన్‌, తదితర అర్జీలను సంబంధిత అధికారులను వెంటనే తగిన చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్య క్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-13T06:24:35+05:30 IST