జంగుబాయి క్షేత్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పూజలు

ABN , First Publish Date - 2022-12-30T22:21:09+05:30 IST

కెరమెరి, డిసెంబరు 30: గిరిజనుల ఆరాధ్యదైవం జంగుబాయి పుణ్యక్షేత్రం లో శుక్రవారం ఎమ్మెల్యే ఆత్రంసక్కు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిదిగోత్రాల గిరిజనులు తమ కులదైవంగా భావించే జంగుబాయి క్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

జంగుబాయి క్షేత్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పూజలు

కెరమెరి, డిసెంబరు 30: గిరిజనుల ఆరాధ్యదైవం జంగుబాయి పుణ్యక్షేత్రం లో శుక్రవారం ఎమ్మెల్యే ఆత్రంసక్కు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిదిగోత్రాల గిరిజనులు తమ కులదైవంగా భావించే జంగుబాయి క్షేత్రాన్ని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పుణ్యక్షేత్ర అభివృద్ధికి తానుఎప్పుడు ముందుండి తనవంతు సహకారం అందజేస్తానని పేర్కొన్నారు. జనవరి 5న నిర్వహించే దర్బార్‌కు పెద్దఎత్తున గిరిజనులు తరలి రానుండ డంతో ఆలయకమిటీ ఆధ్వర్యంలో వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆయనవెంట ఆలయకమిటీ అధ్యక్షుడు జాకో, తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-30T22:21:11+05:30 IST