టోల్ప్లాజాను ప్రారంభించడం సరికాదు
ABN , First Publish Date - 2022-12-31T22:51:11+05:30 IST
ఎన్హెచ్ 363 రహదారి పూర్తి కాక ముందే టోల్ప్లాజాను ప్రారంభించడం సరికాదని, ఇది కాంట్రా క్టర్ ప్రయోజనాల కోసమేనని అఖిలపక్ష కమిటీ నాయకులు సంజయ్ కుమార్, వెల్ది సుదర్శన్, భూమయ్య, ఎండీ జాఫర్లు పేర్కొన్నారు.
మందమర్రిటౌన్, డిసెంబరు 31: ఎన్హెచ్ 363 రహదారి పూర్తి కాక ముందే టోల్ప్లాజాను ప్రారంభించడం సరికాదని, ఇది కాంట్రా క్టర్ ప్రయోజనాల కోసమేనని అఖిలపక్ష కమిటీ నాయకులు సంజయ్ కుమార్, వెల్ది సుదర్శన్, భూమయ్య, ఎండీ జాఫర్లు పేర్కొన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. కార్మికులు, భూనిర్వాసితులు, స్థానికులకు టోల్ మినహాయింపు, టోల్ప్లాజాలో ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇచ్చినప్పటికీ ఉద్యోగాలు కల్పించాలన్నారు. జిల్లా ప్రజలు రోజుకు రెండు, మూడు సార్లు టోల్ప్లాజా దాటాల్సి వస్తుం దని, దీంతో వారిపై ఆర్థిక భారం పడుతుందన్నారు. స్ధానికులకు టోల్ ఫీజు మినహాయింపు ఇవ్వకపోతే ఆందోళనలు చేస్తామని తెలిపారు. షరీఫా, రామస్వామి, సంపత్, అనంతలక్ష్మీ, రాజు పాల్గొన్నారు.