ప్రభుత్వ కళాశాల విద్యార్థులు టాపర్లు కావడం అభినందనీయం
ABN , First Publish Date - 2022-06-30T03:44:59+05:30 IST
మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల టాపర్గా కాగజ్నగర్ ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థి జెల్ల అమన్, జిల్లా టాపర్ జాబితాలో ప్రవల్లిక రావడం ఎంతో అభినందనీయమని ఎమ్యెల్యే కోనప్ప అన్నారు. బుధవారం స్థానిక కళాశాలను సందర్శించి టాపర్ విద్యార్థులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ చక్కగా చదివి జిల్లాకు మంచి పేరు తెస్తున్న విద్యార్థులకు కృతజ్ఙతలు తెలిపారు.
కాగజ్నగర్, జూన్ 29: మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల టాపర్గా కాగజ్నగర్ ప్రభుత్వ కళాశాలకు చెందిన విద్యార్థి జెల్ల అమన్, జిల్లా టాపర్ జాబితాలో ప్రవల్లిక రావడం ఎంతో అభినందనీయమని ఎమ్యెల్యే కోనప్ప అన్నారు. బుధవారం స్థానిక కళాశాలను సందర్శించి టాపర్ విద్యార్థులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ చక్కగా చదివి జిల్లాకు మంచి పేరు తెస్తున్న విద్యార్థులకు కృతజ్ఙతలు తెలిపారు. అనంతరం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఫోన్లో టాపర్గా నిలిచిన అమన్తో మాట్లాడించారు. ఈ సందర్భంగా మంత్రి అమన్ను అభినందించారు. అలాగే బోధించిన అధ్యాపకులకు, వసతులు కల్పించిన ఎమ్మెల్యే కోనప్పకు, అమన్ తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. అనంతరం మంత్రి కళాశాల బృందంతో మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివి కార్పొరేట్కు దీటుగా మార్కులు సాధించడంపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వకళాశాల్లో నాణ్య మైన అందుతుందనడానికి ఇదే చక్కటి నిదర్శనమన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోనప్ప చేసిన సేవలను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎంఏ ఆసీఫ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మినరసింహం, మండల విద్యాధికారి భిక్షపతి పాల్గొన్నారు.