పనులను వేగంగా పూర్తి చేయండి
ABN , First Publish Date - 2022-12-28T02:06:14+05:30 IST
మనఊరు - మనబడి పథకంలో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధి కారులను ఆదేశించారు.
నిర్మల్ కల్చరల్, డిసెంబరు 27 : మనఊరు - మనబడి పథకంలో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధి కారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష జరిపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల పూర్తిపై అలసత్వం ప్రదర్శించవద్దని, గడువులోగా పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్ హేమంత్బోర్కడే , ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.