తెలంగాణ సాంస్కృతిక సౌరభం కాళోజీ

ABN , First Publish Date - 2022-09-10T07:03:42+05:30 IST

తెలంగాణ సాంస్కృతిక సౌరభం కాళోజీ

తెలంగాణ సాంస్కృతిక సౌరభం కాళోజీ
క్యాంపు కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి పువ్వాడ

జయంతి కార్యక్రమాల్లో మంత్రి పువ్వాడ

ఖమ్మం కార్పొరేషన్‌/ రఘనాథపాలెం, సెప్టెంబరు 9: స్వరాష్ట్ర ఉద్యమానికి తన రచనలతో స్ఫూర్తిని నింపిన తెలంగాణా సాంస్కృతిక సౌర భం కాళోజీ నారాయణరావని, స్వాతంత్య్ర సమరయోధుడిగా సామాజిక ఉద్యమకారుడిగా, కవిగా తెలంగాణ సమాజం అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం వీడీవోస్‌ కాలనీలోని తన క్యాంపు కార్యాలయం, రఘనాథపాలెంలో నిర్వహించిన నారాయణరావు జయంతి కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ గళాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. తెలంగాణ భాషకు, సాహిత్యానికి కాళోజీ చేసిన కృషిని గౌరవిస్తూ కాళోజీ జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. అలాగే సాహితీవేత్తలకు, కవులకు కాళోజీ పేరుమీద రాష్ట్రప్రభుత్వం విశిష్ట పురస్కారం అందజేస్తోందన్నారు. రఘునాథపాలెం కార్యక్రమంలో మంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న పువ్వాడను టీఆర్‌ఎస్‌ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు.

Updated Date - 2022-09-10T07:03:42+05:30 IST