మున్సిపాలిటీ సమస్యలపై సీపీఐ దీక్ష

ABN , First Publish Date - 2022-08-26T03:36:41+05:30 IST

క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలు పరి ష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో ఒక రోజు దీక్ష చేపట్టారు. గురువారం కార్యా లయ ఆవరణలో చేపట్టిన దీక్షను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేని శంకర్‌ ప్రారంభించారు. జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేరలే దన్నారు.

మున్సిపాలిటీ సమస్యలపై సీపీఐ దీక్ష
దీక్షలో కూర్చున వారికి పూల మాల వేస్తున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్‌

మందమర్రి, ఆగస్టు 25: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలు పరి ష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో ఒక రోజు దీక్ష చేపట్టారు. గురువారం కార్యా లయ ఆవరణలో చేపట్టిన దీక్షను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేని శంకర్‌ ప్రారంభించారు. జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేరలే దన్నారు. పేదలకు ఇచ్చే డబులు బెడ్‌రూం ఇండ్లు పంపిణీ చేయలేదని, ప్లై ఓవ ర్‌ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయని, డంపిండ్‌ యార్డ్‌, శ్మశాన వాటి కల ఊసేలేదని,  దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేయాలని డిమాండ్‌ చేశారు. హెల్త్‌ సెంటర్లలో పశువుల ఆసుపత్రులలో వైద్యులను నియమించాలని, స్వచ్ఛ మైన నీటిని  అందించాలని, ఆసరా పెన్షన్లు, తెల్ల రేషన్‌ కార్డుల ప్రక్రియ కొనసా గించాలని కోరారు. నాయకులు  లింగయ్య, ఎండీ అక్బర్‌ ఆలీ, వనం సత్య నారాయణ, మిట్టపల్లి పౌల్‌, నక్క వెంకట్‌స్వామి, సాంబయ్య, మెరుగు రాజేశం, బైర కొమురయ్య, కట్ల రమేష్‌, మామిడి గోపి, రవిందర్‌, రాజు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-26T03:36:41+05:30 IST