Chennai:వాహనాల వేలం..రూ.24.5 లక్షల ఆదాయం
ABN , First Publish Date - 2022-10-18T16:27:42+05:30 IST
గ్రేటర్ చెన్నై పోలీస్ సరిహద్దులో పార్క్ చేసిన వాహనాలను వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి రూ.24.5 లక్షల ఆదాయం
చెన్నై/ఐసిఎఫ్: గ్రేటర్ చెన్నై పోలీస్ సరిహద్దులో పార్క్ చేసిన వాహనాలను వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి రూ.24.5 లక్షల ఆదాయం లభించిందని పోలీసు శాఖ తెలిపింది. నగరంలో పలు ప్రాంతాల్లో చాలారోజులుగా 595 బైక్లు, 11 ఆటోలు, ఒక కారుతో పాటు 607 వాహనాలు ఉండడాన్ని గుర్తించిన పోలీసులు వాటిని స్థానిక కొరుక్కుపేట పోలీసు సాయుధదళ మైదానానికి తరలించారు. ఆ వాహనాలు ఆదివారం వేలం వేయగా రూ.24,05,250కు విక్రయమయ్యాయని అధికారులు తెలిపారు.