మద్యం మత్తులో అక్కపై దాడి

ABN , First Publish Date - 2022-12-02T00:50:37+05:30 IST

మండలంలోని జిల్లా ప్రజా పరిషత్‌ పాఠశాలలో గురువారం మధ్యా హ్న భోజనం కోసం వంటచెరుకు అవసరమైంది.

మద్యం మత్తులో అక్కపై దాడి

నర్సాపూర్‌(జి), డిసెంబరు 1 : మండలంలోని జిల్లా ప్రజా పరిషత్‌ పాఠశాలలో గురువారం మధ్యా హ్న భోజనం కోసం వంటచెరుకు అవసరమైంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట చేసే ముగ్గు రు మహిళలు సట్ల రాజమణి, వచ్చలబాయి, రాజవ్వ కలిసి వంటచెరుకు తేవడానికి అనుమతి కొరకు పాత నర్సాపూర్‌ గ్రామనర్సరీ వైపు వెళ్లారు. అక్కడే ఉన్న సట్ల రాజమణి తమ్ముడు సట్ల ముత్యం అనే వ్యక్తి తాగడానికి ఆమెను ఇరవై రూపాయలు అడుగ గా తన దగ్గర లేవని చెప్పింది. దీంతో తాగిన మైకం లో సట్లముత్యం తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను చంపాలని ఆమెపై దాడి చేశాడు. ఆమె తప్పించు కోవడానికి ప్రయత్నించగా ఆమెవీపులో కత్తి చీల్చుకుపోయింది. రాజమణి తండ్రి సట్లరాజన్న చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పాకాల గీత తెలిపారు. స్థానికులు వెంటనే నిర్మల్‌ ఆసుపత్రికి తరలించగా బాధితురాలు క్షేమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

Updated Date - 2022-12-02T00:50:38+05:30 IST