ఆర్టీసీ బస్సులో చోరీ

ABN , First Publish Date - 2022-03-10T07:29:23+05:30 IST

భైంసా నుండి నిజామా బాద్‌ వెళుతున్న ఆర్టీసీ బస్సులో బుధవారం చోరీ జరిగింది.

ఆర్టీసీ బస్సులో చోరీ
ముథోల్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ప్రయాణీకుల వద్ద వివరాలు సేకరిస్తున్న పోలీసులు

ముథోల్‌, మార్చి, 9 : భైంసా నుండి నిజామా బాద్‌ వెళుతున్న ఆర్టీసీ బస్సులో బుధవారం చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం భైంసా నుండి నిజామాబాద్‌ వెళుతున్న ఆర్టీసీ బస్సులో ప్రయా ణిస్తున్న మహారాష్ట్రలోని బోకర్‌కు చెందిన జరీనా బేగంకు సంబంధించిన సుమారు ఆరు తులాల బం గారం, నగలు అలాగే మహారాష్ట్రలోని జౌల గ్రామా నికి చెందిన గజానంద్‌కు చెందిన 15 వేల నగదు చోరీకి గురైంది. ఈ విషయం ముథోల్‌ సమీపంలోకి రాగా ఆలస్యంగా గమనించిన బాఽధితులు వెంటనే బస్‌డ్రైవర్‌ కు తెలియజేశారు. దీంతో డ్రైవర్‌ నేరుగా ముథోల్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ తిరు పతి పోలీసుసిబ్బందితో తనిఖీలు చేశారు. అయిన ప్పటికీ ఎలాంటి అపహరణకు గురైన సొమ్ము దొరక లేదు ముథోల్‌ ఎస్‌ఐ తిరుపతి భైంసా పోలీసులను ఆశ్రహించాలని బాధితులకు సూచించారు. వెంటనే భైంసా పోలీసులతో మాట్లాడారు. బాధితులకు బస్‌ చార్జీలకు డబ్బులు లేకపోవడంతో ఎస్‌ఐ తన స్వంత డబ్బులిచ్చి భైంసాకు పంపించారు. ప్రయాణ సమ యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Updated Date - 2022-03-10T07:29:23+05:30 IST