మహిళలను కించపరిచిన మంత్రిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-12-07T00:03:37+05:30 IST

మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

మహిళలను కించపరిచిన మంత్రిపై చర్యలు తీసుకోవాలి

తలమడుగు, డిసెంబరు6: మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం తలమడుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి రెడ్డి మహిళలను అగౌరపరిచి విధంగా కిట్టిపార్టీలోకి వెళ్తారని అవహేళన చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. రెడ్డి సంఘం మహిళల పట్లనే కాదు మరే ఇతర మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యాలుచేయడం సరికాదని, మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం మండల యువజన అధ్యక్షుడు నల్లపద్మాకర్‌రెడ్డి, సంఘం అధ్యక్షులు కరుణాకర్‌రెడ్డి, కార్యదర్శులు నవీన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:03:38+05:30 IST