6 రోజుల క్రితం సొంతూరికి.. గుడికి వెళ్లొస్తానని చెప్పిన యువకుడు.. ఎంతకూ రాకపోవడంతో తమ్ముడు వెళ్లి చూస్తే షాకింగ్ దృశ్యం..
ABN , First Publish Date - 2022-05-30T18:01:46+05:30 IST
ఆ యువకుడు ముంబైలోని ఓ క్యాంటిన్లో పని చేస్తున్నాడు.. ఆరు రోజుల క్రితం సొంతూరికి వెళ్లాడు..
ఆ యువకుడు ముంబైలోని ఓ క్యాంటిన్లో పని చేస్తున్నాడు.. ఆరు రోజుల క్రితం సొంతూరికి వెళ్లాడు.. ఐదు రోజులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపాడు.. ఆరో రోజు ఉదయం గుడికి వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.. రెండు గంటలు దాటినా తిరిగి రాకపోవడంతో తమ్ముడు వెళ్లి వెతికాడు.. ఇంటికి అర కిలోమీటర్ దూరంలో అన్నయ్య ఉరేసుకుని చనిపోయాడు.. రాజస్థాన్లోని దుంగార్పూర్లో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
షాకింగ్.. భర్త, సోదరుడి ఎదురుగానే దొంగ బాబా దారుణం.. మహిళ బట్టలు విప్పించి..
దుంగార్పూర్లోని దోజా గ్రామానికి చెందిన ముఖేష్ 6 రోజుల క్రితమే ముంబై నుంచి స్వగ్రామానికి వెళ్లాడు. ఐదు రోజులు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపాడు. ఆదివారం ఉదయం గుడికి వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రెండు గంటలు దాటినా తిరిగి రాకపోవడంతో ముఖేష్ తమ్ముడు అతడిని వెతకడానికి బయటకు వెళ్లాడు. ఇంటికి అర కిలోమీటర్ దూరంలోని అటవీ ప్రాంతంలోని ఓ చెట్టుకు ముఖేష్ మృతదేహం వేలాడుతూ కనిపించింది.
షాకైన తమ్ముడు తన కుటుంబ సభ్యులందరికీ విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టంకు తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ముఖేష్ ఎందుకు చనిపోయాడనేది ఇంకా బయటకు రాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.