హెడ్మాస్టర్ అత్యాచారం చేశాడంటూ మహిళ వీరంగం.. తీరా అసలు విషయం బయటపడడంతో షాక్!
ABN , First Publish Date - 2022-02-21T18:51:49+05:30 IST
అత్యాచారం పేరుతో ఓ స్కూల్ హెడ్మాస్టర్ను వేధించిన మహిళను, ఆమె భర్తను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అత్యాచారం పేరుతో ఓ స్కూల్ హెడ్మాస్టర్ను వేధించిన మహిళను, ఆమె భర్తను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసు పెడతానని చెప్పి ఆ హెడ్మాస్టర్ నుంచి మహిళ, ఆమె భర్త రూ.6 లక్షలు వసూలు చేశారు. మరో నాలుగు లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడి కొడుకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
రాజస్థాన్లోని నాగౌర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న జైపాల్ సింగ్కు అదే గ్రామానికి చెందిన వనిత భర్వారీ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ నెల 19వ తేదీన జైపాల్ను వనిత తన ఇంటికి ఆహ్వానించింది. అతణ్ని గదిలోకి తీసుకెళ్లి ఆమె నగ్నంగా మారిపోయింది. అతడిని కూడా నగ్నంగా మార్చేసింది. వారిద్దరూ నగ్నంగా ఉండగా వనిత భర్త గణపత్ వీడియో తీశాడు. అనంతరం జైపాల్పై దాడికి దిగాడు.
తనకు రూ.10 లక్షల నగదు ఇవ్వాలని లేకపోతే వీడియో పోలీసులకు చూపించి అత్యాచారం కేసు పెడతానని వనిత బెదిరించింది. దీంతో భయపడిన జైపాల్ తన కొడుక్కి ఫోన్ చేసి డబ్బులు తీసుకురమ్మని అడిగాడు. జైపాల్ కొడుకు రూ.6 లక్షలు తీసుకొచ్చి గణపత్కు అందించాడు. అయినా వారు జైపాల్ను వదలకుండా మరో నాలుగు లక్షలు డిమాండ్ చేశారు. దీంతో జైపాల్ కొడుకు పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే గణ్పత్ ఇంటికి వెళ్లి అతడిని విడిపించారు. రూ.6 లక్షలను స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.