ప్రియుడితో కలిసి పారిపోయేందుకు భార్య ప్లాన్.. తీరా వెళ్లే క్రమంలో ఎంటరైన భర్త.. చివరకు ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు..
ABN , First Publish Date - 2022-01-25T21:23:45+05:30 IST
జార్ఖండ్లో ఓ మహిళ వివాహేతర సంబంధాన్ని కొనసాగించేది. కొన్నాళ్లకు ఇద్దరూ కలిసి పారిపోయేందుకు ప్రయత్నించారు. తీరా వెళ్లే క్రమంలో భర్త ఎంటరయ్యాడు. చివరకు అతడు తీసుకున్న నిర్ణయం.. అంతా అవాక్కయ్యేలా చేసింది...
వివాహ బంధాన్ని కొందరు తేలిగ్గా తీసుకుంటుంటారు. భర్త, పిల్లలు ఉన్నవారు కూడా తప్పటడుగులు వేయడం సర్వసాధారణమైంది. కొందరు మాయమాటలు నమ్మి మోసపోతుంటే.. మరికొందరు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ చివరకు జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. జార్ఖండ్లో ఓ మహిళ వివాహేతర సంబంధాన్ని కొనసాగించేది. కొన్నాళ్లకు ఇద్దరూ కలిసి పారిపోయేందుకు ప్రయత్నించారు. తీరా వెళ్లే క్రమంలో భర్త ఎంటరయ్యాడు. చివరకు అతడు తీసుకున్న నిర్ణయం.. అంతా అవాక్కయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళితే..
జార్ఖాండ్లోని పలాము జిల్లా కేంద్రంలో ఓ మహిళ.. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. సంసారం సవ్యంగా సాగుతున్న క్రమంలో మహిళకు ఓ యువకుడు పరిచయమయ్యాడు. కొన్నాళ్లకు వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రోజూ భర్తకు తెలీకుండా ప్రియుడిని కలుస్తూ ఉండేది. కొన్ని నెలల తర్వాత.. ఇద్దరూ ఇల్లు వదిలి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడితో పాటూ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. తీరా ఇంటి నుంచి బయటికి వెళ్లగానే భర్త ఎదురుపడడంతో షాక్ అయ్యారు.
టాయిలెట్ నుంచి శబ్ధాలు వస్తున్నాయని పక్కింటి వారిపై కోర్టులో కేసు.. 19 ఏళ్ల తర్వాత ఎలాంటి తీర్పు వచ్చిందో తెలుసా..
భార్యపై అప్పటికే అనుమానం కలిగిన భర్త.. రోజూ ఆమెను గమనిస్తూ ఉండేవాడు. ఎట్టకేలకు దొరికిపోవడంతో, ఇద్దరినీ గ్రామస్తుల సమక్షంలో నిలబెట్టాడు. పెద్దమనుషులు సర్దిచెప్పాలని చూసినా భర్త మాత్రం ఒప్పుకోలేదు. తనకు ఇలాంటి భార్య అవసరం లేదని, ప్రియుడితోనే వెళ్లిపొమ్మని చెప్పాడు. అలాగే తన కూతురును కూడా తీసుకెళ్లమని సూచించడంతో గ్రామస్తులంతా అవాక్కయ్యారు. చిన్న చిన్న విషయాలకే భార్యలపై దాడులు చేసే భర్తలు ఉన్న ఈ కాలంలో, భార్యకు ఏమాత్రం హాని చేయకుండా ప్రియుడితో పాటూ పంపడం.. సర్వత్రా చర్చనీయాంశమైంది.