బంధువు కావడంతో రోజూ స్నేహితుడి ఇంట్లోకి వెళ్లేవాడు.. అతడి భార్యకు దగ్గరై.. చివరకు వారు చేసిన నిర్వాకం..
ABN , First Publish Date - 2022-01-03T02:08:23+05:30 IST
వివాహేతర సంబంధాలు చివరకు విషాదాంతం కావాల్సిందే. అయినా చాలా మంది ఇంట్లో దొరికే సుఖాన్ని కాదని తప్పటడుగులు వేస్తుంటారు. చివరకు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తుంటారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని..
వివాహేతర సంబంధాలు చివరకు విషాదాంతం కావాల్సిందే. అయినా చాలా మంది ఇంట్లో దొరికే సుఖాన్ని కాదని తప్పటడుగులు వేస్తుంటారు. చివరకు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తుంటారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని అమేథి జిల్లాలో ఓ ఘటన జరిగింది. బంధువు కావడంతో ఓ వ్యక్తి రోజూ ఇంట్లోకి వెళ్లేవాడు. ఈ క్రమంలో స్నేహితుడి భార్యకు దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్లోని అమేథి జిల్లాకు చెందిన దంపతులకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఓ కుమార్తె ఉంది. మెకానిక్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇదిలావుండగా సమీపంలో ఉండే నితిన్ అనే యువకుడు వీరికి బంధువు అవుతాడు. దీంతో రోజూ మెకానిక్ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ క్రమంలో అతడి భార్యకు దగ్గరయ్యాడు. భర్తకు తెలీకుండా ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. తర్వాత ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
న్యూఇయర్ వేడుకల్లో పోలీసులు.. మందులోకి ముక్క లేదని వారు చేసిన పనికి గ్రామస్తులు షాక్.. చివరకు
భర్త అడ్డుగా ఉండడంతో ఎలాగైనా మట్టుబెట్టాలని కుట్ర పన్నారు. మెకానిక్ మద్యం తీసుకుంటుండగా.. అందులో నిద్రమాత్రలు కలిపారు. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే నితిన్ తన వాహనంలో ఎక్కించుకుని.. ప్రమాదం జరిగినట్లు క్రియేట్ చేశాడు. అయితే మెకానిక్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి భార్యను, నితిన్ను వారి స్టైల్లో విచారించగా విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.