నాలుగేళ్ల ప్రేమ.. వేరే వ్యక్తితో ప్రేయసి వివాహం.. తట్టుకోలేకపోయిన ఆ యువకుడు ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2022-02-21T22:49:22+05:30 IST
వారిద్దరూ కలిసి ఇంజినీరింగ్ చదివారు.. నాలుగేళ్లు ప్రేమలో మునిగి తేలారు.. కచ్చితంగా పెళ్లి చేసుకుందామనుకున్నారు..
వారిద్దరూ కలిసి ఇంజినీరింగ్ చదివారు.. నాలుగేళ్లు ప్రేమలో మునిగి తేలారు.. కచ్చితంగా పెళ్లి చేసుకుందామనుకున్నారు.. అయితే యువకుడికి ఉద్యోగం లేదని యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు.. దీంతో ఆ యువతి వేరే వ్యక్తితో పెళ్లి పీటల మీద కూర్చుంది.. తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయిన యువకుడు మూడ్రోజులు ఏడుస్తూనే ఉన్నాడు.. చివరకు ప్రేయసి పెళ్లిరోజే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన సూరజ్ సాహు అనే యువకుడు ఇంజినీరింగ్ చదివే సమయంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. చదువుకునే రోజుల్లో ఇద్దరూ కలిసి మెలిసి తిరిగారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే సూరజ్కు ఉద్యోగం రాలేదనే కారణంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. తమ కూతురుకి వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. ఆదివారం ఆమె పెళ్లి జరిగింది.
ఆమె పెళ్లి విషయం తెలుసుకున్న దగ్గర్నుంచి సూరజ్ డిప్రెషన్లో కూరుకుపోయాడు. మూడ్రోజుల పాటు ఏడుస్తూనే ఉన్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసి తన గదిలోకి వెళ్లాడు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో సోదరుడు వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు.