ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు దొరికిపోయిన మహిళ.. వారిద్దరినీ తాళ్లతో కట్టేసి ఆ భర్త ఎంత దారుణంగా హింసించాడంటే..

ABN , First Publish Date - 2022-03-03T20:04:44+05:30 IST

ఆ మహిళకు వివాహమైంది.. భర్త ఉండగానే వేరే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది..

ప్రియుడితో కలిసి ఉండగా భర్తకు దొరికిపోయిన మహిళ.. వారిద్దరినీ తాళ్లతో కట్టేసి ఆ భర్త ఎంత దారుణంగా హింసించాడంటే..

ఆ మహిళకు వివాహమైంది.. భర్త ఉండగానే వేరే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. భర్తకు తెలియకుండా అతడిని తరచుగా కలిసేది.. భర్తకు విషయం తెలియడంతో అతను ఆమెను కొట్టేవాడు.. అయినా ఆమెలో మార్పు రాలేదు.. ఇటీవల ఆమె ప్రియుడితో కలిసి ఉండగా భర్త చూసేశాడు.. ఇద్దరినీ ఇంట్లో ఓ స్థంభానికి కట్టేశాడు.. చుట్టుపక్కల వారిని పిలిచి ఇద్దరినీ కర్రతో చితక్కొట్టాడు.. అతను అరగంట పాటు ఆగకుండా కొట్టడంతో ఇద్దరూ స్పృహ కోల్పోయారు.. ఆ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన కన్నయ్యలాల్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. కన్నయ్యలాల్ భార్య తమ బస్తీలోనే ఉండే సంజయ్ దామోర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలియడంతో భార్యను కన్నయ్యలాల్ కొడుతూ ఉండేవాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. బుధవారం ఉదయం ప్రియుడితో ఉన్న భార్యను కన్నయ్యలాల్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. పట్టరాని కోపంతో ఇద్దరినీ చితకబాదాడు. ఇద్దరినీ ఇంట్లోని స్థంభానికి తాళ్లతో కట్టాడు. 


అరగంట పాటు ఆపకుండా ఇద్దరినీ కొట్టాడు. దీంతో ఇద్దరూ స్పృహ కోల్పోయారు. అనంతర సంజయ్‌కు గుండు గీశాడు. స్థానికులు ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో నిందితుడు పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.   

Updated Date - 2022-03-03T20:04:44+05:30 IST