బంధువుల ఇంటికెళ్లి తిరిగొచ్చిన భార్య.. తాళం తీసి గదిలోకి వెళ్లగానే బెడ్రూంలో అర్ధనగ్నంగా ఓ యువతి శవం.. ట్విస్ట్ ఏంటంటే..
ABN , First Publish Date - 2022-02-21T02:46:49+05:30 IST
కొన్ని సమస్యలు కాసేపటికి సర్దుమణుతుంటాయి. ఇంకొన్ని సమస్యలు చాలా దూరం వరకు వెళ్తుంటాయి. ప్రధానంగా డబ్బు, మద్యం, వివాహేతర సంబంధానికి సంబంధించిన విషయాల మీదే గొడవలు జరుగుతుంటాయి. ఢిల్లీలో ఓ..
సవ్యంగా సాగుతున్న సంసారంలో అప్పుడప్పుడూ సముద్రంలో తుఫాను తరహాలో సమస్యలు వచ్చిపడుతుంటాయి. కొన్ని సమస్యలు కాసేపటికి సర్దుమణుతుంటాయి. ఇంకొన్ని సమస్యలు చాలా దూరం వరకు వెళ్తుంటాయి. ప్రధానంగా డబ్బు, మద్యం, వివాహేతర సంబంధానికి సంబంధించిన విషయాల మీదే గొడవలు జరుగుతుంటాయి. ఢిల్లీలో ఓ కుటుంబంలో ఎలాంటి ఆర్థిక సమస్యలూ లేవు. దంపతులు ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఓ రోజు భార్య తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగొచ్చింది. ఇంట్లోకి వెళ్లగానే బెడ్రూంలో అర్ధనగ్నంగా ఓ యువతి శవం పడి ఉంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్కు గురైంది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలోని బురారీ కౌశిక్ ఎన్క్లేవ్లోని ఓ ఇంట్లో అమన్ బిష్త్ అనే వ్యక్తి తన భార్య ప్రియాంక రావత్తో కలిసి నివాసం ఉంటున్నాడు. అమన్ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ దంపతులకు ఎలాంటి సమస్యలూ లేకపోవడంతో సంసారం సవ్యంగా సాగుతూ ఉండేది. ఈ క్రమంలో శుక్రవారం ప్రియాంక తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన అమన్.. నాథుపురా ప్రాంతానికి చెందిన ఓ బాలికను తన ఇంటికి తెచ్చుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ కాసేపటికి బాలిక గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
అర్ధరాత్రి బర్త్డే వేడుకలు.. పొద్దున్నే భార్యను పిలిస్తే గదిలోంచి నో రెస్పాన్స్.. తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లి చూస్తే..
రాత్రి ఇంటికి వచ్చిన ప్రియాంక.. ఇంట్లో బాలిక మృతదేహం అర్ధనగ్నంగా పడి ఉండడం చూసి షాక్ అయింది. గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరుకున్నారు. ఈ హత్య ఎవరు, ఎందుకు చేశారో వారికి కాసేపు అర్థం కాలేదు. అయితే ఎంతసేపటికీ భర్త ఇంటికి రాకపోవడం, ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో అనుమానం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.