‘‘ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నా’’... అంటూ బాలికను నమ్మించి తీసుకెళ్లాడు.. చివరకు వైద్య పరీక్షల్లో తేలింది ఏంటంటే..
ABN , First Publish Date - 2022-03-16T00:40:44+05:30 IST
మహిళలను వక్ర దృష్టితో చూసేవారు.. వారిని నమ్మించేందుకు ఏవేవో మాయ మాటలు చెబుతుంటారు. అలాంటి మోసగాళ్ల మాటలు నమ్మిన కొందరు చివరకు..
మహిళలను వక్ర దృష్టితో చూసేవారు.. వారిని నమ్మించేందుకు ఏవేవో మాయ మాటలు చెబుతుంటారు. అలాంటి మోసగాళ్ల మాటలు నమ్మిన కొందరు చివరకు జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. పెళ్లి పేరుతో కొందరిని, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా తీసుకుని.. డబ్బు ఆశ చూపుతూ మరికొందరిని నమ్మించి చివరికి నట్టేట ముంచుతుంటారు. ఈ క్రమంలో కొందరు బాలికలు, యువతులు చివరికి తమ ప్రాణాలు తీసుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం. గుజరాత్లో ఇటీవల జరిగిన ఓ ఘటన.. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ‘‘నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నా.. పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటా’’.. అంటూ ఒక బాలికను నమ్మించిన ఓ వ్యక్తి చివరకు చేసిన పని.. సభ్య సమాజం తల దించుకునేలా ఉంది. ఆరునెలల తర్వాత చివరకు బాలికకు వైద్య పరీక్షలు చేయగా అసలు విషయం తెలిసింది.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఆరు నెలల క్రితం 13ఏళ్ల బాలిక పరిచయమైంది. ఆమెను ఎలాగైనా తనతో పాటూ తీసుకెళ్లాలని కుట్రపన్నాడు. ఈ క్రమంలో బాలికను పదే పదే కలుస్తూ పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఆర్థిక అవసరాలను గుర్తించి.. అప్పుడప్పుడూ డబ్బు ఇస్తూ ఉండేవాడు. దీంతో బాలిక కూడా అతన్ని బాగా నమ్మింది. తల్లిదండ్రులకు తెలీకుండా ఆ వ్యక్తితో పాటూ వివిధ నగరాలకు వెళ్తూ ఉండేది. ఓ రోజు బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ‘‘నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నా.. పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటా’’.. అంటూ నమ్మించాడు. తర్వాత ఆమెపై బలాత్కారం చేశాడు. ఇలా తరచూ ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ ఉండేవాడు.
పీఈటీ చేసిన నిర్వాకాన్ని తల్లిదండ్రులకు చెప్పలేకపోయింది.. ఇటీవల చెల్లెలికి కూడా అలాగే జరగడంతో.. చివరికి..
కొంత కాలం తర్వాత ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. కేసు పెడితే తమ పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసుల వద్దకు వెళ్లలేదు. అయితే రోజులు గడుస్తున్నా తమ కూతురు ఇంటికి రాకపోవడంతో చివరికి పోలీసులను సంప్రదించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత శుక్రవారం అహ్మదాబాద్లోని ఓ హోటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. అత్యాచారం జరిగినట్లుగా తేలింది. దీంతో నిందితుడిపై ఆదివారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.