SuperStarKrishna: కృష్ణా నదిలో తండ్రి అస్థికలు కలపడానికి విజయవాడ వచ్చిన మహేష్ బాబు

ABN , First Publish Date - 2022-11-21T12:16:51+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సోమవారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. కుటుంబ సభ్యులు అందరితో హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు.

SuperStarKrishna: కృష్ణా నదిలో తండ్రి అస్థికలు కలపడానికి విజయవాడ వచ్చిన మహేష్ బాబు
File photo of Trivikram Srinivas and Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు సోమవారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. కుటుంబ సభ్యులు అందరితో హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చారు (MaheshBabu arrived in Vijayawada from Hyderabad in a special flight). విమానాశ్రయం నుండి కృష్ణా నదిలో తండ్రి కృష్ణ గారి అస్థికలు కలపడానికి మహేష్ బాబు మరియు కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు. అస్థికలు కలిపి, మళ్ళీ మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారని తెలిసింది. మహేష్ బాబు వెంట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మెహెర్ రమేష్, చిన్నాన్న ఆదిశేషగిరి రావు, బావలు సంజయ్ స్వరూప్, గల్లా జయదేవ్, సుధీర్ బాబు వెళ్లారు. మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా వీరిలో వున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ ఈనెల 15వ తేదీన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణ గారి అంత్యక్రియలు 16వ తేదీన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అశేష అభిమానుల, ప్రజానీకం మధ్య జరిగిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు కొడుకుగా మహేష్ బాబు తన తండ్రికి చెయ్యాల్సిన కర్మలు అన్నీ చేస్తున్నాడు. అందులో భాగంగానే అస్థికలు కృష్ణా నదిలో కలపడానికి సోమవారం విజయవాడ వచ్చారు. మహేష్ బాబు కుటుంబంలో ఇది మూడో విషాదం. ముందు అన్న రమేష్ బాబు, తరువాత తల్లి ఇందిరాదేవి, మొన్న తండ్రి కృష్ణగారు పరమపదించారు. (#MaheshBabu to do Asthi Visarjan in Krishna river, Vijayawada)

Updated Date - 2022-11-21T15:55:59+05:30 IST