Uttar Pradesh: డ్రింక్‌లో డ్రగ్స్ కలిపి అఘాయిత్యం.. బ్లాక్ మెయిల్ చేసి రూ.80 లక్షలు స్వాహా.. చివరకు..

ABN , First Publish Date - 2022-10-05T23:02:46+05:30 IST

ఆ వ్యాపారవేత్త బాగా డబ్బున్న ఓ వివాహితతో స్నేహం చేశాడు.. తరచుగా పార్టీలకు ఆమెతో కలిసి వెళ్లేవాడు..

Uttar Pradesh: డ్రింక్‌లో డ్రగ్స్ కలిపి అఘాయిత్యం.. బ్లాక్ మెయిల్ చేసి రూ.80 లక్షలు స్వాహా.. చివరకు..

ఆ వ్యాపారవేత్త బాగా డబ్బున్న ఓ వివాహితతో స్నేహం చేశాడు.. తరచుగా పార్టీలకు ఆమెతో కలిసి వెళ్లేవాడు.. ఆరు నెలల క్రితం ఆమెను ఓ పార్టీకి తీసుకెళ్లి ఆమె డ్రింక్‌లో మత్తు పదార్థాలు కలిపాడు.. ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు.. ఆ వీడియో చూపించి బెదిరిస్తూ ఆమె నుంచి ఏకంగా రూ.80 లక్షలు లాగేశాడు.. అతడి ఆగడాలను భరించలేకపోయిన మహిళ ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. 


ఇది కూడా చదవండి..

LED Tv Blast: బాంబులా పేలిన ఎల్‌ఈడీ టీవీ.. బాలుడి మృతి!


ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ప్రశాంత్ కుమార్ సింగ్‌ లక్నోకు చెందిన ఓ వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. ధనవంతుల కుటుంబానికి చెందిన ఆ మహిళతో స్నేహం చేసేవాడు. తరచుగా ఆమెతో కలిసి పార్టీలకు హాజరయ్యేవాడు. ఆరు నెలల క్రితం ఆమెను ఓ పబ్‌కు తీసుకెళ్లి అక్కడ ఆమె తాగే పానీయంలో డ్రగ్స్ కలిపాడు. మగతలో ఉన్న ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు అవసరమైనప్పుడల్లా డబ్బులు అడిగితీసుకునేవాడు. అంతేకాదు ఆమెను బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడు. 


అలా ఆమె నుంచి దఫదఫాలుగా రూ.80 లక్షలు కాజేశాడు. అయినా ఆ డబ్బుతో ప్రశాంత్ సంతృప్తి చెందలేదు. జిమ్ ప్రారంభిస్తున్నానని చెప్పి మరింత డబ్బు అడిగాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

Updated Date - 2022-10-05T23:02:46+05:30 IST