leaders with blood: రక్తంతో స్వాతంత్య్ర ఉద్యమ నాయకుల చిత్రాలు
ABN , First Publish Date - 2022-07-31T15:46:35+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధులు స్మారకార్ధం తన రక్తం(Blood)తో వారి చిత్రాలు చిత్రీకరించిన ఓ మహిళ వారికి నివాళులర్పించింది. సేలం జిల్లా తారమంగళం
పెరంబూర్(చెన్నై), జూలై 30: స్వాతంత్య్ర సమరయోధులు స్మారకార్ధం తన రక్తం(Blood)తో వారి చిత్రాలు చిత్రీకరించిన ఓ మహిళ వారికి నివాళులర్పించింది. సేలం జిల్లా తారమంగళం అరుణాచలపుదూర్ గ్రామానికి చెందిన సంఘ సేవకురాలు సుశీల గాజుల దుకాణం(Sushila Glass Shop) నిర్వహిస్తోంది. ఈమె జాతీయ నాయకులను స్మరించుకొనేలా గాంధీ, నేతాజీ, భారతీదాసన్, వావూ చిదంబరం, అంబేడ్కర్, తిరువళ్లువర్ తదితరు చిత్రాలను తన రక్తంతో రూపొందించింది. ఇందుకోసం పోలీసుల అనుమతితో ప్రభుత్వాసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్(Blood bank) ద్వారా తన రక్తం తీసుకొని మహనీయుల చిత్రాలు వేసింది. దేశ స్వాతంత్య్రం కోసం రక్తం చిందించిన నేతలకు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసేలా తన రక్తంతో వారి చిత్రాలు రూపొందించినటు