Hyderabad Book Fair : హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదగాలి..!

ABN , First Publish Date - 2022-12-28T21:19:27+05:30 IST

బుక్ ఫెయిర్ ను ఆదరణ చూస్తూంటే పుస్తకాల డిమాండ్ అర్థం అవుతుంది.

 Hyderabad Book Fair : హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదగాలి..!
Hyderabad Book Fair

35 వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యక్రమంలో బుక్ వాక్ నిర్వహించారు. లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ గుడి నుండి బుక్ ఫెయిర్ వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో అవంతి కాలేజ్ విద్యార్దులు, పాఠశాల విద్యార్దులు ఉత్సహంగా పాల్గొన్నారు. పుస్తకం వర్ధిల్లాలలని విద్యార్ధులు నినదించారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో, పుస్తకమే ప్రపంచం అనే నినాదాలతో ప్లకార్డ్ ను ప్రదర్శించారు.

పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ లేటి దామోదర్ గుప్తా , బుక్ ఫెయిర్ అద్యక్షలు జూలరు గౌరీశంకర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవా బుక్ వాక్ జెండా ఊపి పుస్తక నడక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా మాట్లాడుతూ... తెలంగాణ లో పోలీసులు లాఠీ కి పనిలేదు కాని పుస్తకాలకు డిమాండ్ పెరిగిందని అన్నారు. ఇంటర్ నెట్ వచ్చిన తర్వాత పుస్తకం తెరమరుగవుతుందని అంటున్నారు. కానీ ప్రతి సంవత్సరం బుక్ ఫెయిర్ ను ఆదరణ చూస్తూంటే పుస్తకాల డిమాండ్ అర్థం అవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక వేల పుస్తకాలు చదివిన స్పూర్తి మనకు రావాలన్నారు. తెలంగాణలో కవులను కరువు లేదన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఇంటర్నేషన్ స్థాయిలో ఎదగాలని అన్నారు. జయహా పుస్తకం. సమాజంలో పుస్తకమే వర్ధిల్లుతుందని ఈ సందర్భంగా అన్నారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ అద్యక్షులు జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ...బుక్ ప్రదర్శనలో పుస్తక నడక ద్వారా యువతకు ,విద్యార్థులకు గొప్పసందేశం ఇచ్చేందుగాను ఈ బుక్ వాక్ ను నిర్వహించామని తెలిపారు. ప్రతి వారు పుస్తకం చదవాల్సిన అవసరం ఉందన్నారు. పుస్తకాలు చదవడం ద్వారా తమను తాము ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు పుస్తకాలు దొహద పడుతాయని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నా ప్రతి విద్యార్దికి ఈ వాక్ ద్వారా సందేశం చేరాలని అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవా మాట్లాడుతూ... పుస్తకాలు చదవండి, మొక్కలు నాటండి అని పిలుపునిచ్చారు.

అవంతి కాలేజ్ కర్పెండెంట్ ప్రోఫెసర్.సోమేశ్వర్ రావు మాట్లడుతూ సెల్ ఫోన్ ను పక్కన పెట్టి పుస్తకాలు చదవాలని అన్నారు. మంచి పుస్తకాలు చడవడం ద్వారా మంచి పౌరులు ఎదగవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ కార్యదర్శి శృతికాంత్ భారతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాసులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-28T21:33:54+05:30 IST