14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వీడియో ఇంటర్నెట్లో పెడతామని బెదిరించి రూ.50 వేలు స్వాహా.. రూ.2.5 లక్షలు అడిగితే ఇవ్వలేదని..
ABN , First Publish Date - 2022-09-30T21:27:37+05:30 IST
రాజస్థాన్లో 16 ఏళ్ల మైనర్ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
రాజస్థాన్లో 16 ఏళ్ల మైనర్ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను వీడియోలు తీశారు. ఆ వీడియోలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరించి బాలిక నుంచి రూ.50 వేలు వసూలు చేశారు. ఆ తర్వాత రూ.2.5 లక్షలు కావాలని డిమాండ్ చేశారు. బాలిక ఆ డబ్బులు చెల్లించలేకపోవడంతో ఆమె వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజస్థాన్లోని అల్వార్లో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలిక.. డాక్టర్ చేసిన ఇంజెక్షన్తో దారుణం.. చివరకు..
బాధిత బాలికపై 9 నెలల క్రితం 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశారు. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి బాలిక నుంచి ముందు రూ.50 వేలు తీసుకున్నారు. ఆ తర్వాత రెండున్నర లక్షల రూపాయలు అడిగారు. బాలిక 2.5 లక్షల రూపాయలు చెల్లించలేకపోవడంతో, నిందితులు ఆమె వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలను బాధిత బాలిక కుటుంబ సభ్యులు చూసి ఉలిక్కిపడ్డారు.
బాధితురాలిని అడగ్గా ఆమె మొత్తం విషయం చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి 8 మంది యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు నిందితులపై పోక్సో, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.